secunderabad to yadagirigutta mmts train timings route map ticket price
యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్ మంజూర అయిందని కేంద్ర బొగ్గు పనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో 13 రైళ్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు .అమృత భారత్ పథకం కింద పున నిర్వహించిన బేగంపేట రైల్వే స్టేషన్లో అంతా మహిళా ఉద్యోగుల సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. Yadagiri gutta MMTS రైల్వే ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు రోజుకు 50,000 మంది నుంచి లక్ష మంది వరకు వెళ్తుంటారని వారి ప్రయాణ సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు .రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన స్థల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు .
తెలంగాణలో ఒకే సమయంలో 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు 2026 నాటికి స్టేషన్లను స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రార్థించే యడం జరుగుతుందని తెలిపారు .సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లకు అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి భక్తులకు రైలు సౌకర్యం కల్పించాలని ప్రధానిని కోరానని ఆయన చెప్పారు . వెంటనే రైల్వే స్టేషన్ కి నిధులు మంజూరు చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు .దసరా నాటికి పనులు పూర్తిచేసుకుని కొమరవెల్లి మల్లన్న భక్తులకు ఈ స్టేషన్ అంకితం చేస్తామని చెప్పారు.